గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (11:57 IST)

భర్తకు వేరొక మహిళతో అక్రమ సంబంధం.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త వేరొకరితో తిరుగుతున్నాడనే అనుమానంతో ఆమె భర్త లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా గుర్ల

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త వేరొకరితో తిరుగుతున్నాడనే అనుమానంతో ఆమె భర్త లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా గుర్ల మండలం గరిడ గ్రామానికి చెందిన విక్రమ్ శ్రీను కొంతకాలంగా అనకాపల్లిలో తాపీమేస్త్రీగా పవిచేస్తూ పూడిమడక రోడ్డులోని సున్నం బట్టీల సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చి ఐదో తేదీన స్వగ్రామానికి చెందిన బాల వెంకటరావు కుమార్తె శైలజ (20)తో వివాహమైంది. అనంతరం భార్యను తీసుకువచ్చి కాపురం మొదలుపెట్టాడు.
 
అయితే శ్రీనుకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. రాత్రివేళల్లో ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడని శైలజ గరిడలో ఉంటున్న తన సోదరికి చెప్పేదని కుటుంబసభ్యులు అంటున్నారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి ఎనిమిది గంటలకు శ్రీను ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా శైలజ వద్దని చెప్పినప్పటికీ ఆయన బయటకు వెళ్లాడని పట్టణ సీఐ సంపతిరావు విద్యాసాగర్‌ తెలిపారు. 
 
బయటకు వెళ్లిన శ్రీను రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి తలుపులు తెరిచేసరికి శైలజ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శైలజ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గరిడలో నివాసముంటున్న మామ వెంకటరావుకు ఫోన్‌లో విక్రమ్‌ శ్రీను తెలిపారన్నారు. శైలజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విక్రమ్ శ్రీనును అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.