టి.లో ఒకటి, ఆంధ్రలో రెండు సెజ్లు-చెన్నై-విశాఖలో ఇండస్ట్రియల్ కారిడార్!
తెలంగాణలో మెదక్ జిల్లాలో ఏపీలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సెజ్లు ఏర్పాటవుతాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో ఒకటి, ఆంధ్రలో రెండు సెజ్ లు ఏర్పాటవుతాయని సీతారామన్ తెలిపారు.
తెలంగాణలో 24 సెజ్లలో పనులు జరుగుతుండగా, 36 సెజ్లలో కార్యకలాపాలు జరగడం లేదని... ఏపీలో 18 సెజ్లలో పనులు జరుగుతుండగా, 27 చోట్ల జరగడం లేదని తెలిపారు. చెన్నై-విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని స్పష్టం చేశారు.