గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 జులై 2014 (18:08 IST)

పొట్ట తగ్గించాలంటే అనాస పండును తినండి!

అనాసపండులోని విటమిన్ ఎ, బి, సిలు పొట్టను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖానికి తేజస్సును ఇస్తే అనాసపండులో ధాతువులు, పీచు, ఇనుము శక్తులున్నాయి. ఇవి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. అనాస పండు రసంతో తేనె కలిపి 40 రోజుల పాటు తీసుకుంటే.. తలనొప్పి, నోటిపూత, మెదడు సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. 
 
పచ్చకామెర్లు నయం కావాలంటే అనాసపండు జ్యూస్ తీసుకోవాలి. శరీరంలో రక్తశాతం తక్కువగా ఉంటే అనాస పండు మంచి ఫలితాన్నిస్తుంది. ఇంకా వేవిళ్లు, ఆకలికాకపోవడం వంటి రుగ్మతలను అనాస దూరం చేస్తుంది. 
 
రాత్రి పూట అనాస పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. ఒక టీ స్పూన్‌ ఓమం పొడి బాగా కలపాలి. తర్వాత ఒక గ్లాసు నీరు చేర్చి.. స్టౌ మీద బాగా మరిగించాలి. దానిని గట్టిగా మూతపెట్టి వుంచాలి. మరుసటి రోజూ అనాస రసాన్ని బాగా పిండి పరగడుపున తాగాలి. ఇలా పదిరోజుల పాటు చేస్తే పొట్ట తగ్గిపోతుంది. 
 
అలాగే బాదం పౌడర్‌తో కాసింత తేనె కలిపి ఉదయం అల్పాహారానికి ముందు తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. కేరట్‌తో తేనె కలిపి తీసుకుంటే.. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇంకా బరువు కూడా తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలు, అనారోగ్యం నుంచి బయటపడాలంటే తప్పకుండా అనాస పండును తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.