శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (09:30 IST)

కడుపులో మంట... ఎసిడిటీతో బాధపడుతుంటే..

ఎసిడిటీతో గుండెల్లో మంట ఏర్పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అందుకు గల కారణాలు, నివారించడానికి కొన్నిచిట్కాలు తెలుసుకుందాం...
 
అసిడిటీకి కారణాలు : 
 
1.  సరిగా నిద్ర లేకపోవడం, తీసుకునే ఆహారాన్ని త్వరగా భుజించడం, సరిగా నమిలి తినకపోవడం, సరియైన సమయానికి తినకపోవడం.
2. ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం.
3. ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం.
4. శరీరానికి తగిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమవుతుంది.
 
ఎసిడిటీని అదుపు చేసేందుకు చిట్కాలు :
 
1. ఎసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూసును తేనెతో కలిపి భోజనానికి తర్వాత తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.  
 
2. తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించుకోవాలి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం తీసుకోవడం తగ్గించుకోవాలి.
 
3. పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. ఉదాహరణకు... ఉల్లిపాయలు, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి మొదలైనవి అలవాటుగా తీసుకోవాలి.
 
4. మీరు తీసుకునే ఆహారంలో భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకూడదు. 
ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. 
 
అసిడిటీ నివారణకు చిట్కాలు :
 
1. అసిడిటీతో బాధపడే వారికి తులసి దివ్యమైన ఔషధం. తులసి ఆకులను నిత్యం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 
2. నిత్యం బెల్లం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని ప్రతి రోజు నాలుగు నుంచి ఐదుసార్లు తీసుకోవాలి. 
 
3. పుచ్చకాయ, కీరకాయ, అరటిపండును సేవిస్తే అసిడిటీ మటుమాయం. 
 
4. భోజనానంతరం పుదీనా రసం సేవిస్తే అసిడిటీ నుంచి ఉపశమనం కలిగి మంచి ఫలితాన్నిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.