గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (16:59 IST)

కాలానుగుణంగా పండ్లు, కూరగాయలు తీసుకోండి.. ఆహారంలో మార్పులు అవసరం..

ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని పదార్థాలు పూర్తిగా మానేయడం వల్ల వాటిని మళ్లీమళ్లీ తినాలని అనిపించొచ్చు. అందుకే ఏది అతిగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే అద

ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని పదార్థాలు పూర్తిగా మానేయడం వల్ల వాటిని మళ్లీమళ్లీ తినాలని అనిపించొచ్చు. అందుకే ఏది అతిగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే అదనపు కెలొరీలు శరీరంలోకి చేరవు. బరువూ పెరగరు. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి. 
 
భోజనానికి ముందు సూప్‌, సలాడ్‌ వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడే భోజనం తక్కువగా తీసుకోగలుగుతారు. అంతేకాదు చిరుతిళ్లకు బదులు పండ్లు ఎంచుకోవడం వల్ల వాటిల్లోని పీచు అరుగుదలకు తోడ్పడుతుంది.
 
అలాగే వెన్న తీసిన పాలూ, పాల పదార్థాలూ.. చిరుధాన్యాలు తీసుకోవాలని అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. ప్యాక్‌ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవండి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.