శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (18:44 IST)

మహిళలు నాజూగ్గా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

మహిళలు 30 దాటినా తమ శరీరాన్ని నాజుగ్గా ఉంచుకోవాలనుకుంటారు. అయినా కొందరు ఒబిసిటీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి మహిళలు దీర్ఘకాలం పాటు నాజూగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. సాధారణంగా మనం తీసుకునే ఆహారాన్నిబట్టే మన ఆరోగ్యం ఉంటుంది. కొవ్వు కేలరీలు తక్కువగా ఉండి ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు అత్యధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పచ్చిబఠాణి, బీట్‌రూట్, బంగాళాదుంపలు తరచుగా తీసుకుంటూ వుండాలి. 
 
డెయిరీ ఉత్పత్తులతో పాటు మాంసంకృతులను ఎక్కువగా తీసుకోవాలి. పూర్తి స్థాయిలో ఉండే పాలు, పెరుగు, పనీర్ కాకుండా స్కిమ్డ్ పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. ఈ పాలతో తయారయ్యే క్రీమ్, ఛీజ్, పనీర్, పెరుగు, మిల్క్, ఐస్‌క్రీమ్స్‌ను ఎక్కువగా తినాలి. 
 
అలాగే, పండ్లలో యాపిల్స్, యాప్రికోట్స్, ఉసిరి, ద్రాక్ష, జామ, నిమ్మ, లిచి, అరెంజ్, స్ట్రాబెర్రీలతో పాటు.. పప్పు దినుసులైన బీన్స్, శనగలు, రాజ్‌మా మంటి వస్తువులు, కరిగి పోయే పదార్థాలు తీసుకోవాలని డైటీషియన్స్ సలహా ఇస్తున్నారు.