శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (09:19 IST)

రికార్డు కోసం అతిశృంగారం... అక్కడ నొప్పితో చనిపోయిన మహిళ

ఇటీవల ఓ మహిళ రికార్డు కోసం అతిశృంగారంలో పాల్గొంది. అంటే కనీసం 10 నుంచి 12 సార్లు పాల్గొంది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో, నెలరోజుల్లోనే చనిపోయింది. శవపరీక్షలో అతిశృంగారం కారణంగా ఆమె చనిపోయినట్టు వైద్యు

ఇటీవల ఓ మహిళ రికార్డు కోసం అతిశృంగారంలో పాల్గొంది. అంటే కనీసం 10 నుంచి 12 సార్లు పాల్గొంది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో, నెలరోజుల్లోనే చనిపోయింది. శవపరీక్షలో అతిశృంగారం కారణంగా ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
 
కాగా, అతిశృంగారం వల్ల ప్రపంచవ్యాప్తంగా యేటా వేలమంది చనిపోతున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. సెక్స్‌ సమయంలో కామవాంఛ తారాస్థాయికి చేరినప్పుడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి, భాగస్వామిపై పైశాచికంగా దాడిచేయడం వల్ల కూడా పలువురు చనిపోతున్నారు. అందుకే సెక్స్‌ మితంగా ఉంటేనే అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.
 
నిజానికి దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా ముఖ్యమేనంటున్నారు సెక్సాలజిస్టులు. భాగస్వాములు ఆనందకరమైన శృంగారంతో ఆరోగ్యాన్ని పొందవచ్చునంటున్నారు. అయితే శ్రుతిమించితే మాత్రం ప్రమాదానికి దారితీస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. 
 
20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు లేదా నాలుగుసార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం వల్ల కడుపు నొప్పి రావడం, ఇనఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు.