మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 మే 2017 (15:34 IST)

విజయవంతంగా 150 గుండె ఆపరేషన్‌లు పూర్తి చేసిన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి

చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గత యేడేళ్ళ కాలంలో 150 గుండె మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దక్షిణాసియాలోనే ఈ

చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గత యేడేళ్ళ కాలంలో 150 గుండె మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దక్షిణాసియాలోనే ఈ తరహా ఫీట్‌ను సాధించిన తొలి కార్పొరేట్ ఆస్పత్రిగా మలర్ ఆస్పత్రి రికార్డుపుటలకెక్కింది. పైగా, ఈ ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ల సక్సెస్ రేటు 90 శాతంగా ఉండటం గమనార్హం.
 
ఈ ఆస్పత్రికి చెందిన కార్డియాక్ సైన్సెస్, ఫోర్టిస్ సెంటర్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ డైరక్టర్ డాక్టర్ కేఆర్. బాలకృష్ణన్, కార్డియాక్ అనెస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ విభాగం అధిపతి డాక్టర్ కేజీ సురేష్ రావులు సారథ్యంలోని వైద్యబృందం ఈ ఘనతను సాధించాయి. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్ మాట్లాడుతూ... అవయవాల కొరతకు సమాధానాన్ని తమిళనాడులో భారత్ కనుగొందన్నారు. తమ ఆస్పత్రి యాజమాన్యంతో పాటు వైద్యు, సహాయక సిబ్బంది సహకారంతో 150 గుండె మార్పిడి ఆపరేషన్లు పూర్తి చేసినట్టు తెలిపారు. వీరందరికి కంటే ముందుగా అవయవాలనుదానం చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించాల్సి ఉందన్నారు. దాతలు ముందుకు రావడం వల్లే ఈ అరుదైన ఫీట్‌ను సాధించినట్టు తెలిపారు. 
 
కాగా, ప్రభుత్వ గణాంకాల మేరకు.. వివిధ సమస్యతో బాధపడుతున్న వారి ప్రాణాలను రక్షించాలంటే ప్రతి యేడాది 2 లక్షల కిడ్నీలు, 30 వేల కాలేయాలు, 50 వేల గుండె అవయవాలను సేకరించాల్సి ఉందన్నారు. అందేసమయంలో దేశంలో నాన్ కమ్యూనబలు వ్యాధుల బారిన పడి మృతి చెందే వారి సంఖ్య పెరుగుతుందని, దీంతో అవయవదానంపై అవగాహన పెరుగుతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఎన్.సి.డి బారిన పడి 5.87 మిలియన్ల మంది చనిపోతుండగా, వీరిలో 60 శాతం మంది ఒక్క భారత్‌లోనే మృత్యువాత పడుతున్నారని ఆయన తెలిపారు. 
 
కాగా, అవయవదానంలో తమిళనాడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో అవయవదానం రేటు గత 2014 సంవత్సరంలో 0.34 శాతంగా ఉందన్నారు. గత 2012 సంవత్సరంతో పోల్చుకుంటే  ఇది ఎంతో మేలన్నారు. కాగా, ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి 9 యేళ్ళ రష్యా బాలుడికి విజయవంతంగా గుండె ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే, 78 యేళ్ళ వృద్ధుడికి గుండె మార్పిడి ఆపరేషన్ చేసి చరిత్ర సృష్టించింది.
 
అంతేకాకుండా, దేశంలోని తొలి ఇంటర్ స్టేట్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపేరషన్‌ను పూర్తి చేసింది. గత 2015 ఆగస్టు నెలలో కేవలం రెండు వారాల వ్యవధిలో మూడు ఇంటర్ స్టేట్ హార్ట్ స్టేట్ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యంగా 30 శాతం విదేశీ రోగులకు చివరి దశలో చికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించింది. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులతో పాటు.. సిబ్బంది, పలువురు పేషంట్లు పాల్గొన్నారు.