గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:13 IST)

సాయంసంధ్య వేళలో పండ్లు, ఇడ్లీలు, చపాతీలు తింటే...

సాధారణంగా మరింత నాజూక్కా కనిపించేందుకు వివిధ రకాల వ్యాయామాలు, ఉపవాసాలు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తుంటారు. నిజానికి.. స్లిమ్‌గా ఉండాలంటే కొన్నిపాటి చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందాం.

సాధారణంగా మరింత నాజూక్కా కనిపించేందుకు వివిధ రకాల వ్యాయామాలు, ఉపవాసాలు చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తుంటారు. నిజానికి.. స్లిమ్‌గా ఉండాలంటే కొన్నిపాటి చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందాం.
 
సాయంత్రం సమయంలో పండ్లు, ఇడ్లీలు, చపాతీలు తీసుకోవడం ద్వారా బరువుతగ్గుతారు. ఉదయం పూట ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే రోటీలు, సోయా ఆయిల్‌లో సగం ఉడికిన కూరగాయలు, దాల్, సలాడ్ వంటివి తీసుకోవచ్చు. 
 
రాత్రి పూట మితమైన ఆహారంతో పాటు సూప్, సలాడ్, రోటీలు తీసుకోవాలి. మితమైన చక్కెర కలిపిన టీ, కాఫీ, పాలను కూడా సాయంత్రం పూట తీసుకోవచ్చు. ఇక రాత్రిపూట భోజన విషయానికి వస్తే నిద్రకు ఉపక్రమించేందుకు మూడు గంటల ముందే డిన్నర్ తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే బరువు తగ్గుతారని వారు చెబుతున్నారు.
 
అదేవిధంగా, కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాఫీ, టీలను తగ్గించి లెమన్ లేదా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు.