తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉదయం శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా ఏప్రిల్ 2 నుంచి 4 వరకు శ్రీవారి సాకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 4 వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.