తిరుమలలో వైభవంగా చక్రస్నానం
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం అంగరంగవైభవంగా జరిగింది. పుష్కరణిలో జరిగే ఈ మహోత్సవానికి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారి చక్రస్నాన సమయంలో మూడు మునకలు వేసి తరించిపోయారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించారు.. తొమ్మిదిరోజుల పాటు ఈ స్నానంతో సంపూర్ణం చేయడం అనావాయితీ. ఒకవైపు వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమం చాలా కన్నుల పండువలా జరిగింద.ి
చక్రస్నానం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.