బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2015 (08:37 IST)

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 61,807  భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్ట్‌మెంట్లూ నిండిపోయాయి. కనీసం 10గంటల సమయం పడుతోంది. 
 
నడక దారి వచ్చే వారు 4 కంపార్టుమెంట్లలో నిండి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి వీరికి 5 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగవచ్చు. పాఠశాలలకు సెలవులు రావడంతో తిరుమల రద్దీ పెరిగే అవకాశం ఉంది.