తిరుమలలో ఓ మోస్తరు రద్దీ
తిరుమలలో శనివారం భక్తులతో తిరుమల ఓ మోస్తరు రద్దీ ఉంది. తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 60,252 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 13 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. .
ఇక నడకదారిన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంట్లలో నిండి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి వీరికి 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతూ ఉంది.