శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక గవర్నర్
కర్ణాటక గవర్నర్ వజుబాయ్ రుదుబాయ్ వాలా గురువారం ఉదయం కలియుగదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా తిరుమలకు వచ్చిన ఆయనకు ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆలయం వద్ద స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం చేసుకున్న తరువాత రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆయనకు స్వామి వారి చిత్ర పటాన్ని, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. క్యాలెండర్ ను బహుకరించారు.