సర్వభూపాల వాహనంపై కళ్యాణ వెంకటేశ్వరుడు
శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి సర్వభూపాల వాహనంపై ఊరేగారు. తిరుమాడ వీధులలో ఆయన నాలుగోరోజు ఆ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. సర్వభూపాల వాహనంపై కళ్యాణ వేంకటేశ్వర స్వామిని చూసిన భక్తులు పరవశించిపోయారు.
ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి విభాగ సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో శ్రీధర్, ఏఈవో ధనుంజయలు, విజివో రవీంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.