గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : సోమవారం, 11 మే 2015 (13:22 IST)

కంపార్టుమెంట్లలో వేచి ఉన్నభక్తులు... అక్కడికే శ్రీవారి లడ్డూలు...

తిరుమల లడ్డూ టోకెన్ల పంపిణీలో మార్పులు జరుగనున్నాయి. భక్తులు ఇక మీద కంపార్టుమెంట్లలోనే టోకెన్లు తీసుకునే అవకాశాన్ని కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను సమకూర్చింది. మరో నాలుగు రోజుల్లో కంపార్టుమెంట్లలోనే టోకెన్లు పొందవచ్చు. 
 
ఇందుకోసం మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 1 నుంచి 13 కంపార్ట్‌మెంట్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం కాలిబాట భక్తులకు ప్రత్యేకంగా టోకెన్లు ఇస్తున్నారు.దానిపై ఉచిత లడ్డూ కోసం ప్రత్యేకంగా స్టిక్కర్ అతికించి అందజేస్తారు. 
 
ఈ టోకెన్‌తో కంపార్ట్‌మెంట్లలో చేరిన భక్తుడికి రూ. 50కి రెండు, రూ. 100కి నాలుగు చొప్పున భక్తుడు కోరిన లడ్డూల మేరకు స్టిక్కర్లు అతికించి, అందజేస్తారు. ఈ విధానం పూర్తిగా విజయవంతమైతే మలి దశలో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని  మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలోనూ లడ్డూ టోకన్లు జారీ చేస్తారు.