మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : మంగళవారం, 24 మార్చి 2015 (06:29 IST)

గజవాహనంపై ఊరేగిన శ్రీరాముడు

తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీరాముడు సోమవారం రాత్రి గజవాహనంపై ఊరేగారు. తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరాముడు ఊరేగిన వాహనం శోభాయమానంగా వెలుగొందింది. 
 
ఐరావతం అనే ఏనుగు ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి వచ్చిందని పురాణాలు చెబుతుంటాయి. అదే విధంగా అలంకరించిన ఏనుగులు వెలుతుంటే వాటిలో ఒక దానిపై శ్రీరాముడు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి, ఏసివిఎస్వో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.