శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:26 IST)

తిరుమలలో మార్చి నెలలో విశేష పర్వదినాలు..21న ఉగాది ఆస్థానం, 29న శ్రీరాములవారి పట్టాభిషేకం

తిరుమలలో శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో విశేష పర్వదినాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 1 వ తేది నుంచి 5 వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు, 5 వ తేదిన కుమారధార తీర్థముక్కోటి, 7న శ్రీ లక్ష్మి జయంతి, 17న అన్నమాచార్య వర్దంతి, 21 ఉగాది పర్వదినాలు ఉన్నాయి. 
 
ఉగాది సందర్భంగా శ్రీవారి ఆస్థానం అదేరోజు నుంచి తిరుమల శ్రీవారి నిత్యోత్సవాలు ప్రారంభం, 22 న మత్స్యజయంతి, 28 న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రాముల వారి ఆస్థానం, 29 న శ్రీ రాముల వారి పట్టాభిషేక ఆస్థానం లాంటి పండుగలను టిటిడి శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. మొత్తంపై మార్చి నెలలో మరిన్న ధార్మిక కార్యక్రమాలతో తిరుమల మార్మోగనున్నది.