తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 66,717 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 11 నిండాయి. వారికి 7 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 5 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది.
ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం నుంచి రద్దీ క్రమంగా తగ్గనున్నది. ఈ పరిస్థితి బుధవారం కూడా ఇంకాస్త తగ్గుతుంది. పరీక్షలు జరుగుతుండడం వలన అనుకున్న స్థాయిలో రద్దీ పెరగే అవకాశం లేదు.