తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమలలో గురువారం భక్తులతో తిరుమల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. తిరుమలలో బుధవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 42,306 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 14 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. .
ఇక నడకదారిన వచ్చే భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి పంపుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉంది