శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 1 జులై 2015 (09:37 IST)

శ్రీవారికి ఎన్ఆర్ఐ రూ. కోటి విరాళం

శ్రీవారికి వచ్చే కానుకలు, విరాళాలకు ఏమాత్ర కొదవ ఉండదు. అన్నదానం ట్రస్టుకు మొదలుకుని ఆభరణాల వరకూ కోట్ల రూపాయలు విలువ చేసేవి వస్తూనే ఉంటాయి. తాజాగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు ఆర్కే ఆనంద్ రూ.1 కోటి విరాళం ఇచ్చారు. 
 
మంగళవారం తిరుమల దాతల విభాగంలో 1 లక్షా 60 వేల యూఎస్ డాలర్లు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని టీటీడీ నిత్యాన్నప్రసాద ట్రస్టుకోసం వినియోగించాలని దాత కోరారు. అలాగే మరో ఇద్దరు భక్తులు రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు.