తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమలలో రద్దీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 34,814 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది.
ఇక కాలినడకన వచ్చే భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వీరి కోసం 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం ఉదయానికి రద్దీ మరింత పెరిగింది.