గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 23 మే 2015 (08:28 IST)

తిరుమల గిరులకు పోటెత్తిన భక్తజనం

పదో తరగతి, ఎంసెట్‌ ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు మొక్కులు తీర్చుకోవడానికి తిరుమలకు క్యూకట్టారు. శనివారం ఉదయం కూడా కొండ కిటకిటలాడింది. దీనికి వారాంతపు రద్దీ తోడవడంతో తిరుమలంతా జనమే జనం. దీంతో సర్వదర్శనానికి 20 , దివ్యదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సర్వ, దివ్యదర్శన క్యూలైన్లు క్యూకాంప్లెక్సులు నిండి నారాయణగిరి ఉద్యానవనంలోకి కిలోమీటర్‌కు పైగా వ్యాపించాయి. 
 
మహాలఘు దర్శనం నిరంతరాయంగా కొనసాగుతున్నా రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఆలయం ముందు, నాలుగుమాడ వీధులు, అఖిలాండం, లడ్డూ వితరణశాల, నిత్యాన్న సముదాయం, కల్యాణకట్ట భక్తులతో కిక్కిరిశాయి. వచ్చిన వారికి వచ్చినట్లు కేటాయిస్తుండడంతో గదులన్నీ సాయంత్రానికే నిండిపోయాయి. ఆ తర్వాత వచ్చిన భక్తులు వసతి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి.