మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 మార్చి 2015 (18:25 IST)

పవిత్రమార్గం... నా యందు విశ్వాసంతో పనిచేయండి.!

ముక్తి కోసం ఏం చేయాలో భగవంతుడు బోధించాడు. భగవద్గతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినట్లుగా ఉన్నా అది మానవాళి మొత్తానికి సంబంధించిన సందేశం. " నా యందు విశ్వాసంతో పని చేయండి" అని భగవంతుడు చెప్పాడు. భక్తితో భగవంతుని మీద భారం వేయండి. చర్య, ప్రతిచర్యలన్నీ ఆ ఈశ్వర ప్రసాదాలేనని తెలుసుకోండి. 
 
మనస్సు, బుద్ధి రెండూ ఏకం చేయండి. ఆధ్యాత్మిక చింతనవైపు మళ్ళండి. మనసును. ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవటం కష్టమే. ఆ కష్టాన్ని అధిగమించేందుకే యోగా, భక్తి మార్గాల్ని అనుసరించాలి. భగవంతునియందు మనసు లగ్నం చేసేందుకు ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు. మనసును పవిత్రంగా పెట్టుకునేవారికి ముక్తి సులభమవుతుంది.