బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 29 జులై 2015 (07:50 IST)

విజయవాడ, రాజమండ్రిలలో శ్రీవారి ఆలయాలు

తిరుమల వేంకటేశ్వరస్వామిని భక్తులకు మరింత దగ్గర చేయడానికి విజయవాడ, రాజమండ్రిలలో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తెలంగాణలోని భద్రాచలం క్షేత్రంలాగానే కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. మంగళవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ ఆలయాలను నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి మండప నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. టీటీడీలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుమలలో పెట్రోల్ బంకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చదలవాడ వివరించారు.