శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : సోమవారం, 11 మే 2015 (21:50 IST)

శ్రీవారి సేవలో హిజ్రాలు..

హిజ్రాలు సాధారణంగా పూజలు పునష్కారాలకు దూరంగా ఉంటారు. శక్తి గుడి, తిరుణాళ్ళ వంటి వాటికి తప్ప మరెక్కడా సాధారణ దేవాలయాల్లో కనిపించరు. అయితే సోమవారం తిరుమలలో 30 మందికి పైగా హిజ్రాలు శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం సుమారు 30 మందికిపైగా హిజ్రాలు దర్శించుకున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి చెందిన వీరంతా ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కలుసుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లను ఆన్‌లైన్ ద్వారా రిజర్వు చేసుకున్నారు. ఇతర భక్తులతో కలసి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.