Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (08:34 IST)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం నాటికి పెరిగింది. యేడాది ముగుస్తుండడం, క్రిస్మస్ సెలవులు వస్తే మరింత రద్దీ అవుతుంది. శని, ఆదివారాల్లో దర్శనం చేసుకుని వెళ్ళేందుకు వచ్చిన భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఉచిత, రూ 50, రూ 100, రూ 500 గదులు సులభం గా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20 కంపార్టుమెంట్లు నిండాయి.