తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, నడకదారి భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.