Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (08:33 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాటికి సాధారణంగా ఉంది. యేడాది ముగుస్తుండడం, క్రిస్మస్ సెలవులు వస్తే మరింత రద్దీ అవుతుందనుకున్న వారు శని, ఆదివారాల్లో దర్శనం చేసుకుని వెళ్ళారు. దీంతో సోమవారం కాస్త, రద్దీ తగ్గిందనే చెప్పాలి. 50, రూ 100, రూ 500 గదులు సులభం గా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 12 కంపార్టుమెంట్లు నిండాయి.