గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PYR

సాధారణ భక్తులకు రెండు అదననపు లడ్డూలు

తిరుమల తిరుపతి దేవస్ధానం సామాన్య భక్తులకు మరో రెండు అదనపు లడ్డూలను ఇవ్వాలని నిర్ణయించింది. ఇది సోమవారం నుంచే అమలులోకి వచ్చింది. దివ్య దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇది వర్తిస్తుంది. సాధారణంగా సర్వదర్శనం, దివ్యదర్శనం కోసం వచ్చే భక్తులలో ఒక్కొక్కరికి రూ.10 చొప్పున రెండు లడ్డూలు ఇస్తారు. అయితే ప్రస్తుతం అదనంగా ఒక్కొక్కటి రూ. 25 చొప్పున రెండు లడ్డూలను ఇవ్వాలని నిర్ణయించారు. 
 
వేచి ఉన్న భక్తుల సంఖ్యను తగ్గించడంతో పాటు తిరుమలకు వచ్చే భక్తులు సరిపడా లడ్డూలు తీసుకెళ్ళాలనే ఉద్దేశ్యంతోనే  ఈ పని చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.