బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 11 మార్చి 2015 (21:48 IST)

మార్చి 21 ఉగాది, 28న శ్రీరామ నవమి ఆస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం ఉగాది, శ్రీరామనవమి పండగలను పురస్కరించుకుని మార్చి 21, మార్చి 28న తిరుమలలో ఆస్థానం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉగాది ఆస్థానం తిరుమల ఆలయంలో నిర్వహిస్తారు. 
 
మన్మథ ఉగాదిని పురస్కరించుకుని చేసే ఈ కార్యక్రమాన్ని తిరుమల ఆలయంలోని బంగారు వాకిలి వద్ద నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని స్వామి సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి సమక్షంలో జరుగుతుంది. ఆస్థానం 21న ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ నిర్వహిస్తారు. ఇందుకోసం ముందే 17న వచ్చే మంగళవారం రోజున తిరుమంజనం నిర్వహిస్తారు. 28 నిర్వహించే శ్రీరామ నవమి ఆస్థానం అదే స్థానంలో రాత్రి 10 గంటలకు నిర్వహిస్తారు.