శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : శుక్రవారం, 9 జనవరి 2015 (16:05 IST)

రక్తపోటును నియంత్రించే పనస పండు...!

నేటి పోటీ ప్రపంచంలో చిన్న పిల్లల నుంచి ఉద్యోగులు, గృహిణులు తేడా లేకుండా అందరూ పరుగులు తీస్తూ కాలంతో పోటీ పడుతున్నారు. దీని ఫలితం అందరికీ రక్తపోటు (బ్లడ్ ప్రసర్ - బీపీ). ఒక్క సారి ఇది శరీరంలోకి వచ్చినట్లైతే జీవితాంత కాలమంతా వదలదు.
 
అయితే పనస పండు తినడం వల్ల కొంత మేరకు రక్తపోటు కంట్రోల్ అవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. పసన పండులో పొటాషియం సమృద్ధిగా లభిస్తుందని, పొటాషియం రక్త ప్రవాహ వేగాన్ని తగ్గిస్తుందని, తద్వారా రక్తపుటో అదుపులో ఉంటుందని పేర్కొంటున్నారు. రోజు పనస పండును తిన్నట్లైతే ఫలితం కనిపిస్తుందని తెలుపుతున్నారు.