గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By chitra
Last Updated : బుధవారం, 20 జనవరి 2016 (10:45 IST)

పెరుగు కేక్‌ను ఎలా తయారు చేస్తారు.. వాడే పదార్థాలేంటి?

ఆరోగ్యానికి పెరుగు ఎంతో మంచిది. అలాంటి పెరుగుతో ఎన్నో వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఇపుడు పెరుగుతో కేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
పెరుగు కేక్ తయారీకి కావలసిన పదార్థాలు:
మైదా పిండి: 2 కప్పులు
పంచదార పొడి: 2 కప్పులు
వెనిలా ఎసెన్స్: 1 స్పూన్‌
పాలు : అరకప్పు
వెన్న: అరకప్పు
బేకింగ్ సోడా: చిటికెడు
నూనె: 5 స్పూన్‌లు
ఎండు ద్రాక్షలు : తగినంత
జీడిపప్పు: తగినంత 
క్రీమ్ కోసం పాలు: 5 స్పూన్‌లు 
స్ట్రాబెర్రి : అలంకరణ కోసం
 
 
కేక్ తయారీ: నూనె లేకుండా మైదా పిండిని సువాసన వచ్చేలా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో పంచదార వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో బేకింగ్ సోడా, కొంచెం పాలు పోసి బాగా కలిపి పక్కన పెట్టాలి. 10 నిముషాల తర్వాత వెనిలా ఎసేన్స్ చేర్చాలి. ఈ మిశ్రమంలో వేయించుకున్న మైదాపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. క్రీమ్‌లా తయారైన ఈ మిశ్రమంలో ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి కేక్ మౌల్డ్‌లో వేసుకుని ఓవెన్‌లో బేక్ చేయాలి. అరగంటయ్యాక తీయాలి. 
 
క్రీమ్ తయారి : వెన్నలో పంచదార, పాలు, వెనిలా ఎసెన్స్ చేర్చి బీటర్‌తో బీట్ చేయాలి. క్రీమ్ గట్టిగా అయితే కొంచెం పాలు చేర్చాలి. ఇప్పుడు ఈ క్రీమ్‌ను కేక్ మీద పరిచి స్ట్రాబెర్రి‌తో అలంకరించుకుంటే సరిపోతుంది. ఈ పెరుగు కేక్ ఎంతో బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. అంతే ఎంతో టేస్టీ టేస్టీ పెరుగు కేక్ రెడీ.