పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ విదేశాంగ శాఖ జారీ చేసే పాస్పోర్టుల కాల పరిమితిని ఐదేళ్ళ నుంచి పదేళ్ళకు పొడగించినట్టు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ చెప్పారు. అల్లమా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐబీఎంఎస్)ను ప్రారంభించిన తర్వాత ఈ విషయాన్ని మంత్రి మాలిక్ ప్రకటించారు. ఈ కొత్త కాలపరిమితి సెప్టెంబరు నెల నుంచి అమలుకు వస్తుందని చెప్పుకొచ్చారు.