నేపాల్లో శిథిలాల నుంచి సజీవంగా బయటపడిన 105 ఏళ్ల వృద్ధుడు..!
భారీ భూకంపంతో అతలాకుతలమైన నేపాల్లో వేలాది మంది ప్రజలు బలయ్యారు. భారీ భూకంపం సంభవించిన ఎనిమిది రోజులు అయినప్పటికీ అక్కడి పరిస్థితిలు అదుపులోకి రాలేదు. శిథిలాలను తొలగించే కొద్ది శవాలు గుట్టలు గుట్టలుగా వెలిగి వస్తున్నాయి. ఈ స్థితిలో ఆదివారం సహాయక చర్యలు చేపడుతుండగా ఓ 105 ఏళ్ల వృద్ధుడు సజీవంగా శిథిలాల నుంచి బయటపడ్డారు.
శిథిలాల కింద వారం రోజులకుపైగా ఈ శతాధిక వృద్ధుడు ఇంకా సజీవుడిగా ఉండడం విశేషం. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు దేశాలకు చెందిన బృందాలు, నేపాల్ అధికార వర్గాలు ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా మృత దేహాలను వెలికితీశారు.