మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (16:33 IST)

పాక్- ఆప్ఘన్ సరిహద్దుల వద్ద కాల్పులు: 14మంది మృతి

పాకిస్థాన్- అప్ఘానిస్థాన్ సరిహద్దు ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతం దండీ కచ్ ప్రాంతం మంగళవారం రక్తసిక్తంగా మారింది. ఆఫ్ఘానిస్థాన్కు చెందిన తీవ్రవాదుల బృందం పాక్ సరిహద్దు వద్ద పహారా కాస్తున్న సైనికులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది.
 
ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. వారిలో 11 మంది తీవ్రవాదులు కాగా, ముగ్గురు సైనికులని మీడియా మంగళవారం తెలిపింది. భద్రత దళాలు ఓ తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. 
 
అయితే అంతముందు అంటే ఈ రోజు ఉదయం కైబర్ ప్రాంతంలో వైమానిక దాడులలో ఐదు శిబిరాలను నాశనం కాగా, 20 మంది తీవ్రవాదులు మృతి చెందారని పేర్కొంది.