18వ శతాబ్ధపు బుక్ రోమ్లో చోరీకి గురైంది.. అమెరికాలో దొరికింది!
18వ శతాబ్ధానికి చెందిన ప్రఖ్యాత పుస్తకం రోమ్లో చోరీకి గురైంది. ఏడాది తర్వాత అమెరికా ఖండంలో అర్జెంటీనాలో బయటపడింది. సెయింట్ పీటర్ బాసిలికాకు చెందిన ఈ పుస్తకం 1748 నాటిది. రోమ్ లోని ఓ ప్రైవేటు లైబ్రరీ నుంచి ఇది దొంగిలించబడింది.
సదరు లైబ్రరీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా, అర్జెంటీనాలోని ఓ బుక్ స్టోర్లో పుస్తకం ఉన్నట్టు గుర్తించిన అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్లో ఈ పుస్తకం విలువ సుమారు రూ. 2.31 లక్షల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది.