శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 2 జులై 2015 (10:31 IST)

మీ వాళ్ళు జైళ్ళ‌లో 403 మంది ఉన్నారు...భార‌త్‌తో పాక్

జాలర్లుగానో, తెలియ‌క స‌రిహ‌ద్దు దాటో పాకిస్తాన్‌లో అడుగుపెట్టి ప‌ట్టుబ‌డ్డ భార‌తీయుల సంఖ్య 403. ఈ విష‌యాన్ని పాకిస్తాన్ అధికారకంగా వెల్ల‌డించింది.  వివిధ జైళ్లలో 403 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని, వారిలో 355 మంది జాలర్లు అని ఆ దేశం భారత్‌కు బుధవారం తెలిపింది. 
 
అదేవిధంగా భారత్‌లోని జైళ్లలో 278 మంది పాక్ ఖైదీలున్నారని, వారిలో 251 మంది పౌరులు కాగా, 27 మంది జాలర్లు ఉన్నారని భారత్ వెల్లడించింది. పాక్ జైళ్లలోని భారతీయులు, భారత్ జైళ్లలోని పాకిస్తానీల జాబితాలను ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి