ఎయిర్ అల్జీరియా పౌర విమానం ఎక్కడ కూలిందో తెలుసా?
అల్జీరియా దేశంలోని ఎయిర్ అల్జీరియా సంస్థకు చెందిన ఒక పౌర విమానం గురువారంనాడు బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్కు వస్తుండగా వాతావరణం అనుకూలించగా కూలిపోయింది. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, వీరంతా దుర్మరణం పాలయ్యారు.
టేకాఫ్ అయిన పది నిమిషాలకే ఈ విమానం జాడ తెలియకుండా పోయింది. అయితే ఈ విమానం కూలిపోయిందని అధికారులు చెపుతున్నారు. అయితే ఎక్కడ కూలిందన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. తొలుత ఓ నదిలో కూలిపోయిందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎడారిలో కూలిపోయిందని అన్నారు.
తాజాగా మాలీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయిందని అంటున్నారు. భారీగా వర్షం కురుస్తూ ఉండడం, ప్రచండ గాలులు వీస్తూ ఉండడం వల్ల ఈ విమానం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో ఎక్కువ మంది ఫ్రెంచ్, స్పానిష్ జాతీయులే ఉన్నట్టు సమాచారం.