శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2017 (16:13 IST)

డొనాల్డ్ ట్రంప్‌కు తర్వాత అమెరికా అధ్యక్షుడి రేసులో వీరేంద్ర సెహ్వాగ్?!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ స్టోరీ ప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ స్టోరీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ కథనాన్ని నిజంగానా అంటూ సీరియస్‌గా తీసుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. 
 
వివరాల్లోకి వెళితే.. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్.. సమాజంలో జరిగే ప్రతి అంశంపై తనదైన శైలిలో చమత్కారంగా ట్వీట్ చేసి.. అందరి ప్రశంసలు పొందాడు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్ష రేసులో సెహ్వాగ్ ఉన్నట్లు ప్రచురితమైన కథనాన్ని శనివారం తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు పంచుకున్న సెహ్వాగ్‌ హ్యాపీ 'ఏప్రిల్‌ ఫూల్స్‌ డే' అని చెప్పారు.
 
ప్రముఖ ఇంగ్లీషు జర్నలిస్ట్ స్టీఫెన్‌ స్మిత్‌ రాసిన ఈ స్టోరీలో.. అప్పుడప్పుడు అమెరికా వస్తున్న సెహ్వాగ్‌తో అమెరికా ప్రభుత్వం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోందని ఉంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాలు ఇద్దరూ కలిసి సెహ్వాగ్‌ను అమెరికా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారని ఆర్టికల్‌లో స్టీఫెన్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లిన సమయంలో ఇరువురూ మోడీతో ఈ అంశంపై చర్చిస్తారని స్టీఫెన్‌ అందులో పేర్కొన్నారు.