శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (09:30 IST)

వధూవరులతో కలిసి పెళ్ళి లారీ నదిలో పడిపోయింది.. 47మంది మృతి

పెళ్లి సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. ఆ సందడి పూర్తికాకముందే ఆ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వధూవరులతో కలిసి పిల్లలు, పెద్దలు అంతా సంబరంగా లారీలో వేరొకచోటకు వెళ్తున్నారు. అంతలోనే సంతోషమంతా ఆవిరైం

పెళ్లి సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. ఆ సందడి పూర్తికాకముందే ఆ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వధూవరులతో కలిసి పిల్లలు, పెద్దలు అంతా సంబరంగా లారీలో వేరొకచోటకు వెళ్తున్నారు. అంతలోనే సంతోషమంతా ఆవిరైంది. ఓ నదిపై ఉన్న బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి లారీ నదిలో పడిపోయింది. 
 
వధూవరులు, 9 మంది పిల్లలు, 27 మంది మహిళలు, 9 మంది పురుషులు... మొత్తం 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆఫ్రికాలోని మడగాస్కర్‌ రాజధాని అంటాననరివోకు 90 కిలోమీటర్ల దూరంలోని అంజోజోరోబ్‌ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.