మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (20:15 IST)

ఒబామా డిన్నర్ ఇచ్చినా.. ఖాళీ ప్లేటుతో నరేంద్ర మోడీ!!

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక విందు ఇచ్చినప్పటికీ.. మోడీ మాత్రం నవరాత్రి ఉపవాసం కారణంగా కేవలం నిమ్మరసంతో సరిపుచ్చుకున్నారు. 
 
వాస్తవానికి ప్రధాని హోదాలో అమెరికా గడ్డపై కాలుపెట్టిన నరేంద్ర మోడీకి బరాక్ ఒబామా ఘనమైన విందునిచ్చారు. వైట్ హౌస్ వేదికగా ఈ విందుకు మోడీని ఆహ్వానించారు. అయితే చిత్రంగా నరేంద్ర మోడీ ముందు ఖాళీ ప్లేటు దర్శనమివ్వడంతో చూసిన వారు కాస్త అవాక్కయ్యారు. 
 
నవరాత్రుల సందర్భంగా కఠోర ఉపవాసం ఆచరిస్తున్నాననీ, అందువల్ల తాను విందులో కూర్చున్నప్పటికీ ఆహార పదార్థాలను తినలేనని, మిగతావారు విందును ఆస్వాదించాలని, తాను తినకపోవడాన్ని ఎవరూ అసౌకర్యంగా భావించరాదని వివరణ ఇచ్చుకున్నారు నరేంద్ర మోడీ. ఎంతో రుచికరమైన ఒబామా విందును మోడీ తప్ప అంతా ఆస్వాదించారు. వంటకాలు చాలా బావున్నాయని కితాబిచ్చారు.