శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (18:51 IST)

నేను గుజరాతీని, నా రక్తంలోనే వాణిజ్యం : మోడీ

జపాన్ పర్యటనలో భాగంగా జపాన్‌లోని పారిశ్రామిక వేత్తలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ ఆ దేశ ప్రధాని షింజోఅబేతో పలుకీలక అంశాలపై చర్చించారు. 
 
పారిశ్రామికవేత్తల సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. తాను గుజరాతీనని, వాణిజ్యం తన రక్తంలోనే ఉందన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. 
 
భారత్-జపాన్ వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేందుకు తమవంత సహకారం ఉంటుందని మోడీ వ్యాఖ్యానించారు. ఐదు కీలక అంశాలమీద ఇరుదేశాలు సంతకాలు చేశాయని తెలిపారు. ఆరోగ్యం, వారణాసి, క్యోటో, విధ్య అంశాలపై సంతకాలు చేసినట్టు పేర్కొన్నారు.