నేను గుజరాతీని, నా రక్తంలోనే వాణిజ్యం : మోడీ
జపాన్ పర్యటనలో భాగంగా జపాన్లోని పారిశ్రామిక వేత్తలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ ఆ దేశ ప్రధాని షింజోఅబేతో పలుకీలక అంశాలపై చర్చించారు.
పారిశ్రామికవేత్తల సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. తాను గుజరాతీనని, వాణిజ్యం తన రక్తంలోనే ఉందన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
భారత్-జపాన్ వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేందుకు తమవంత సహకారం ఉంటుందని మోడీ వ్యాఖ్యానించారు. ఐదు కీలక అంశాలమీద ఇరుదేశాలు సంతకాలు చేశాయని తెలిపారు. ఆరోగ్యం, వారణాసి, క్యోటో, విధ్య అంశాలపై సంతకాలు చేసినట్టు పేర్కొన్నారు.