బాబు ఐదో రోజు పర్యటన.... జపాన్ ప్రధానితో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ దేశ ప్రధాన మంత్రి షింజో అబేతో భేటీ అయ్యారు. ఆయనతో దాదాపు 15 నిమిషాలపాటు చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు.
జపాన్ ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని, స్వామివారి శేషవస్త్రాన్ని చంద్రబాబు జపాన్ ప్రధానికి అందించారు. అనంతరం జపాన్ ప్రధాని మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి, ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.