శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (08:41 IST)

చైనా కొత్త ప్లాన్.. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు.. అదే జరిగితే అంతే సంగతులు

భారత్-బంగ్లాదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలను ఎడారిగా మార్చేందుకు చైనా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నదిపై మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు డ్రాగన్ కంట్రీ చైనా సమాయత్తమవుతోంది. ఈ

భారత్-బంగ్లాదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాలను ఎడారిగా మార్చేందుకు చైనా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నదిపై మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు డ్రాగన్ కంట్రీ చైనా సమాయత్తమవుతోంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగంగా రికార్డులకెక్కుతుంది.

ఈ  ప్రాజెక్టు నిర్మాణం కోసం కిలోమీటర్‌కు రూ.976 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇక కరువుతో అల్లాడిపోతున్న జింజియాంగ్ ప్రాంతానికి బ్రహ్మపుత్ర నీటిని తరలించి సస్యశ్యామలంగా మార్చాలని భావిస్తోంది. ఈ క్రమంలో వెయ్యి కిలోమీటర్ల పొడవైన  సొరంగాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
 
కాగా.. టిబెట్-జింజియాంగ్ టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసిన చైనా ఇంజనీర్లు ప్రభుత్వానికి మార్చిలోనే అందజేశారని సమాచారం. అప్పట్లో ఖర్చుకు వెనకాడి వెనక్కి తగ్గిన చైనా.. ఇప్పటికిప్పుడు ఈ  ప్రాజెక్టును అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అలాగే ఈ  ప్రాజెక్టును తప్పకుండా నిర్మించి తీరాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాజెక్టును నిర్మించే అవకాశాలున్నాయని చైనా ప్రభుత్వాధికారుల సమాచారం.