బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (12:59 IST)

చైనా బుద్ధి మారదా? దక్షిణాసియాలోకి చొరబడేందుకు..?

చైనా బుద్ధి మారేలా లేదు. మరోసారి తన వంకర బుద్ధిని చైనా బయటపెట్టింది. దక్షిణాసియాలోకి చొరబడేందుకు నేపాల్ సరిహద్దులను కలిపే.. టిబెట్‌లోని జాతీయ రహదారిని పున:ప్రారంభించింది. టిబెట్‌లోని జిగాజే విమానాశ్రయ

చైనా బుద్ధి మారేలా లేదు. మరోసారి తన వంకర బుద్ధిని చైనా బయటపెట్టింది. దక్షిణాసియాలోకి చొరబడేందుకు నేపాల్ సరిహద్దులను కలిపే.. టిబెట్‌లోని జాతీయ రహదారిని పున:ప్రారంభించింది. టిబెట్‌లోని జిగాజే విమానాశ్రయం నుంచి సిటీ సెంటర్ వరకు 40.4 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు ఉన్న హైవేని తెరిచినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. కేవలం పౌర రవాణా అవసరాల కోసమే ఈ హైవేను పున:ప్రారంభించామని చైనా చెబుతున్నా... దీని వెనుక వ్యూహాత్మక నిర్ణయం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. 
 
కాగా ఇంతకుముందు సిక్కిమ్ సరిహద్దుల్లో ఉన్న డోక్లామ్ ప్రాంతంలో రోడ్డును నిర్మించతలపెట్టి.. భారత్ ప్రతిఘటనతో వెనక్కి తగ్గిన చైనా.. ప్రస్తుతం దక్షిణాసియాలోకి చొరబడేందుకు ఈ జాతీయ రహదారిని ప్రారంభించింది.
 
మరోవైపు ప్రపంచ శాంతి - భద్రత విషయాల్లో అమెరికా - జపాన్‌లతో భారత్ బలమైన బంధాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఇది చైనాకు మింగుడు పడడం లేదు. ఈ మూడు దేశాలు ఇలా ముడి వేసుకుంటే.. భవిష్యత్తులో తన ఎత్తులు పారవని - భారత్‌పై కాలు దువ్వేందుకు ఛాన్స్ ఉండదనుకుంటున్న చైనా.. ప్రస్తుతం వెనక్కి తగ్గి భారత్‌కు కొన్ని సూచనలు చేసింది. 
 
అమెరికాతో కలిసి జపాన్.. భారత్‌ను తప్పుదోవ పట్టిస్తోందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అమెరికాను జపాన్ నేరుగా ఎదుర్కోలేక భారత్‌ను ఓ పావులా వాడుకుంటోందని చైనా తెలిపింది.