బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 6 జులై 2016 (15:18 IST)

హాలీవుడ్ తారలతో మజా కోసం రూ.18కోట్లు తగలబెట్టాడు.. కానీ వారు వచ్చారా?

హాలీవుడ్ తారలతో మస్తు మజా చేయడానికి ఓ చైనా వ్యాపారవేత్త రూ. 18కోట్లను ఓ సంస్థకు తగలబెట్టాడు. ఆ తర్వాత అతనితో ఒప్పందం కుదుర్చుకున్నఆ సంస్థ అతడిని మోసం చేసిందని తెలియడంతో తలబద్దలు కొట్టుకున్నాడు.

హాలీవుడ్ తారలతో మస్తు మజా చేయడానికి ఓ చైనా వ్యాపారవేత్త రూ. 18కోట్లను ఓ సంస్థకు తగలబెట్టాడు. ఆ తర్వాత అతనితో ఒప్పందం కుదుర్చుకున్నఆ సంస్థ అతడిని మోసం చేసిందని తెలియడంతో తలబద్దలు కొట్టుకున్నాడు. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. జు యూ అనే వ్యాపారవేత్త హాలీవుడ్ సెక్సీ తారలైన మెగాన్ ఫాక్స్, విక్టోరియా సీక్రెట్ మోల్ కాండీస్ స్వానెపోల్, చైనా ప్రముఖ మోడల్ ఇంగ్ ఇంగ్ వంటి హీరోయిన్లతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. వారితో రాసలీలలో తేలియాడడానికి రూ. 18కోట్లు (హెచ్‌కె21.5మిలియన్ డార్లు) చెల్లించాడు. 
 
అయితే అతడి ఆశలన్నీ అడియాశలయ్యాయి. వాళ్లంతా చైనా వస్తారని ఎంతగానో ఎదురుచూసినా.. వాళ్లెవరూ రాకపోవడంతో చింతించాడు. దాంతో ఆ ఎస్కార్ట్ కంపెనీ మీద దావా వేయాలని నిర్ణయించుకున్నాడు. ఏజెన్సీ వాళ్లు చెప్పినట్లుగానే తాను డబ్బు మొత్తం చెల్లించానని, కానీ తనకు స్వర్గసుఖాలు అందించేందుకు ఏ తార రాలేదని... అందుకే కేసు పెడుతున్నానని సదరు వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేశాడు.