నేపాల్లో గోవధపై నిషేధం కొనసాగింపు: జాతీయ జంతువుగా గోమాత
నేపాల్ జాతీయ జంతువుగా గోమాతను ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. హిందూ దేశంగా పేరున్న నేపాల్లో గోమాతను పరమ పవిత్రంగా పూజిస్తారు. నేపాల్ జనాభాలో మెజారిటీ స్థానం హిందువులదే. ఈ క్రమంలో నేపాలీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కృష్ణ మాట్లాడుతూ.. జాతీయ జంతువుగా గోమాతను ప్రకటించారు.
ఇంకా గోవధపై నిషేధం కొనసాగిస్తుందని తెలిపారు. కొంతమంది ఎంపీలు ఒంటి కొమ్ము ఖడ్గమృగాన్ని జాతీయ జంతువుగా సూచించినప్పటికీ, దానికి ఆమోదముద్ర పడలేదు. ఆవునే జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగిందని కృష్ణ చెప్పారు. హిందువులకు అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ గోవులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ లభిస్తుందని కృష్ణ తెలిపారు.
కాగా నేపాల్లో గతంలో ఏర్పడిన భారీ భూకంపం ద్వారా భారీ ప్రాణనష్టం ఏర్పడింది. ఈ భూప్రకంపనలతో ఏర్పడిన ఆస్తినష్టం నుంచి నేపాల్ మెల్లమెల్లగా కోలుకున్న సంగతి తెలిసిందే.