మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (11:44 IST)

ముస్లిం తీవ్రవాదుల వల్ల జరగరానిది జరిగితే ఆ న్యాయమూర్తిని బాధ్యుడిని చేయాలి : ట్రంప్ నిప్పులు

అమెరికా పౌరుల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా తాను జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్డర్స్‌పై స్టే విధించిన సియోటెల్ న్యాయమూర్తిపై అధ్యక్షుడు డ

అమెరికా పౌరుల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా తాను జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్డర్స్‌పై స్టే విధించిన సియోటెల్ న్యాయమూర్తిపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. దేశంలో జరగరానిది ఏదైనా జరిగితే ఆ న్యాయమూర్తిని, న్యాయవ్యవస్థను బాధ్యులను చేయాలంటూ వ్యాఖ్యానించారు. 
 
తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు కూడా ఆయన గట్టి షాకిచ్చింది. ఇమ్మిగ్రేషన్స్ ఆర్డర్స్‌పై సియోల్ కోట్ ఇచ్చిన స్టేను తొలగించలేమని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని, అందువల్ల కౌంటర్ దాఖలు చేయాలంటూ ట్రంప్ సర్కారును ఆదేశించింది. ఈ ఆదేశాలతో ట్రంప్‌ షాక్‌కు గురయ్యారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ ఇమిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై స్టే విధించిన సియాటెల్ న్యాయమూర్తి రాబర్ట్ ను పిచ్చోడిగా అభివర్ణించారు. ఆ జడ్జికి పిచ్చి పట్టిందని, అందుకే ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాడని, ఆయనపై కేసు పెట్టి జైల్లో పెట్టాలని నిప్పులు చెరిగారు. ఎంతో మంది చెడ్డవారిని అమెరికాకు తీసుకువచ్చి ఇక్కడి ప్రజలకు శాంతి లేకుండా చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు.
 
ఆ న్యాయమూర్తి ఆదేశాల వల్ల అమెరికా పౌరులకు జరగరానిది ఏదైనా జరిగితే ఆ న్యాయమూర్తితో పాటు.. న్యాయవ్యవస్థను బాధ్యులను చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సియోటెల్ కోర్టు రాబర్ట్ తీర్పు పట్ల ఐఎస్ఐఎస్ సహా పలు ఉగ్రవాద సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఆయన తన భయంకరమైన తీర్పును సవరించుకోవాలని సలహా ఇచ్చారు.