బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (16:23 IST)

కెన్యా: బస్సును హైజాక్ చేసి.. 28 మందిని హతమార్చారు!

కెన్యాలో దారుణం చోటు చేసుకుంది. కెన్యాలో తీవ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. సోమాలియాకు చెందిన వంద మంది అల్ షబాబ్ తీవ్రవాదులు గ్రూపుగా ఏర్పడి, కెన్యాలో నైరోబీ బస్సును హైజాక్ చేశారు.
 
అంతేగాకుండా ప్రయాణికుల్లా బస్సెక్కిన తీవ్రవాదులు బస్సును కొంత దూరం తీసుకువెళ్లి ఆపేశారు. తరువాత బస్సునుంచి ప్రయాణికులను కిందికి దింపి 'మీలో సోమాలియా ప్రాంతానికి చెందిన వారెవరు? సోమాలియేతర ప్రాంతానికి చెందిన వారెవరు?' అంటూ ప్రశ్నించారు 
 
తదనంతరం వారిని రెండు గ్రూపులుగా విడగొట్టి.. అమానుషంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అధిక సంఖ్యలో గాయపడ్డారు.